తెలంగాణలో మరో కొత్త నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది. మెదక్, కామారెడ్డి జిల్లా మీదుగా ఈ రహదారి నిర్మించనున్నారు. రూ. 526 కోట్లతో 95 కి.మీ మేర మెదక్- ఎల్లారెడ్డి- బాన్సువాడ- రుద్రూర్ వరకు ఈ రహదారి నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభం కాగా.. యుద్ధప్రతిపాదికన పూర్తి చేస్తున్నారు. త్వరలోనే రోడ్డు అందుబాటులోకి రానుంది.