Ap High Court Gannavaram Farmers Payment: గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించాలన్న పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. భూములను స్వాధీనం చేసుకున్నాక, వాడుకున్నా, వాడుకోకపోయినా కౌలు చెల్లించాల్సిందేనని కోర్టు వ్యాఖ్యానించింది. సీఆర్డీఏను పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు.. ఈ పిటిషన్పై విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే కర్నూలు విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలు వీఎల్జీ ఫెసిలిటీ మేనేజ్మెంట్కు అప్పగించారు.