రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెట్టబడి సాయంగా వివిధ రకాల పథకాల ద్వారా డబ్బులను అందిస్తున్నాయి. అంతే కాకుండా.. పంట నష్టం జరిగితే పరిహారం.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోతే.. బీమాను కల్పిస్తున్నారు. అయితే వ్యవసాయం పంటలకు చీడ పీడల నుంచి రక్షణకు ఎక్కువగా కెమికల్స్ ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా కాకుండా.. రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.