Pithapuram Railway Station Model Status: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిశారు. పిఠాపురం రైల్వేస్టేషన్ను మోడల్స్టేషన్గా అభివృద్ధి చేయాలని, రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులను పీఎం గతిశక్తి పథకంలో చేర్చాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం అమృత్ పథకం కింద స్టేషన్ అభివృద్ధికి, ఆర్వోబీ సమస్య పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని పవన్ తెలిపారు. త్వరలోనే ఆర్వోబీ సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు.