దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్రం అమృత భారత్ పథకం తెచ్చింది. ఇందులో భాగంగా చీపురుపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఏళ్ల తరబడి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఊరట లభించనుంది. ఫ్లాట్ఫారాల పొడిగింపు, షెడ్ల నిర్మాణం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే స్టేషన్ కొత్త కళతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.