Rajahmundry Railway Station Works Speed Up: 2027 గోదావరి పుష్కరాలకు రైల్వేశాఖ భారీ సన్నాహాలు చేస్తోంది. రాజమహేంద్రవరం స్టేషన్లో రూ.286.30 కోట్లతో కొత్త నిర్మాణాలు, విస్తరణ పనులు ఊపందుకున్నాయి. 1,012 ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్లు నడపాలని ప్రణాళిక సిద్ధం చేశారు. భక్తుల రద్దీని తట్టుకునేలా బుకింగ్ కౌంటర్లు, ఎంక్వైరీ సెంటర్లు, ATVMలు ఏర్పాటు చేస్తున్నారు. 2027లో గోదావరి పుష్కరాల కంటే ముందే పనులు పూర్తి చేయాలని లక్ష్యం.