Tejeshwar Case Latest Updates: గద్వాలకు చెందిన సర్వేయర్ తేజేశ్వర్ నెల రోజుల క్రితమే వివాహం చేసుకున్నాడు. భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు కలిసి తేజేశ్వర్ను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఐశ్వర్యకు బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఉందని తేలింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తేజేశ్వర్ను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని తేజేశ్వర్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.