హైదరాబాద్ అంబర్పేట వద్ద రూ. 265 కోట్లతో నిర్మించిన 1.5 కి.మీ. ఫ్లైఓవర్ కింది సర్వీసు రోడ్డు పనులను పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. భూసేకరణ పూర్తికాకపోవడం వల్ల రోడ్డు నిర్మాణం నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి.. భూసేకరణ అడ్డంకులను తొలగించి సర్వీసు రోడ్డును త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.