ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవిలో ఉన్న రాళ్లవాగులో వజ్రాలు దొరుకుతున్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరికీ వజ్రాలు దొరకకపోయినా, అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వందలాది మంది వస్తూనే ఉన్నారు. ఈ ప్రాంతానికి సమీపంలో రైల్వే స్టేషన్ ఉండటం, మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లో ఉండటంతో భారీ ఎత్తున జనాలు ఇక్కడకు తరలి వచ్చి వజ్రాల వేటలో మునిగిపోతున్నారు. అటవీ అధికారులు జనసంచారాన్ని నియంత్రించాలని సూచనలు వస్తున్నాయి.