తెలంగాణ దేశంలోనే నెగెటివ్ ఆహార ద్రవ్యోల్బణాన్ని సుదీర్ఘకాలం పాటు నమోదు చేసిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది. 2025- 2026 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి 8 నెలల పాటు తెలంగాణలో ఆహార ధరలు తగ్గుతూ వచ్చాయి. అయితే వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం, అధిక సరఫరా, తక్కువ డిమాండ్ దీనికి కారణాలని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఆహార పదార్థాల కొనుగోలుకు తగినంత ఆదాయం ప్రజలకు లేకపోవడం కూడా ఆందోళనకర విషయం అని చెబుతున్నారు.