ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేసీఆర్ నిర్వహించబోయే సభ విజయవంతం అవుతుందని, ప్రజలు ఆయనను చూడటానికి ఆసక్తిగా ఉన్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా స్మితా సబర్వాల్ రీట్వీట్పై స్పందిస్తూ ఆమె వాస్తవాన్నే ట్వీట్ చేశారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.