ఖైరతాబాద్లోని నాసర్ స్కూల్లో సీలింగ్ ఫ్యాన్ ప్రమాదంలో కంటిచూపు కోల్పోయిన రుస్దా ఉస్మానికి తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే ఆమెను తరగతులకు అనుమతించాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మధ్యంతర ఉత్తర్వులతో విద్యార్థిని నేటి నుంచే రెగ్యులర్ తరగతులకు హాజరుకానుంది.