కేసులకు భయపడే ప్రసక్తే లేదని.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో మాట్లాడిన వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని.. కేసులకు భయపడవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. కలియుగంలో రాజకీయాలు ఇలాగే ఉంటాయంటూ వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.