TCS visakhapatnam operations announcement: నవంబర్ నెల.. ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చేలా నవంబర్ నెలలో అడుగులు పడనున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నింటికంటే ముందుగా టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. నవంబర్ నెలలో విశాఖ వేదికగా టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అలాగే కాగ్నిజెంట్ కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. నవంబర్ నెలలో కాగ్నిజెంట్ సీఈవో విశాఖలో పర్యటించనున్నారు.