AP High Temperatures Heat Waves: ఆంధ్రప్రదేశ్ ఎండల తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారింది. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో ఏకంగా 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాదు 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇవాళ కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, ఉక్కపోత వాతావరణం కొనసాగుతుంది అని తెలిపారు.