Amaravati Narendra Modi Tour: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాక, అమరావతిలో సాయంత్రం 4 గంటలకు పనులను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు, దీనికి ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరవుతారు. అమరావతి సచివాలయం వెనుక సభా వేదికను ఎంపిక చేశారు.