Gottipati Ravi Kumar On Power Charges Hike: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై మండలిలో మంత్రి గొట్టిపాటి స్పష్టత ఇచ్చారు. తమ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదు, పెంచబోదని చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్ ప్రభుత్వానిదని .. విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజలను వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గత పాలనలోనే 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని.. పీపీఏలను రద్దు చేసి.. పెట్టుబడిదారులను బెదిరించిన చరిత్ర వైఎస్సార్సీపీది అన్నారు.