Andhra Pradesh Farmers Crop Loss Compensation Funds Release: ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. రైతులకు నగదు బదిలీ విధానంలో డబ్బుల్ని విడుదల చేసింది.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాదికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,856 మంది రైతులకు రూ.4.32 కోట్లు విడుదల చేసింది. 2024 మేలో వర్షాలు, ఈదురుగాలులతో రైతులు పంట నష్టపోయారు.. ఈ మేరకు ఆ నష్టపరిహారానికి సంబంధించి డబ్బుల్ని విడుదల చేశారు.