Ap 15 Finance Commission Rs 548 Crores Released: స్థానిక సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.548.28 కోట్ల నిధులను విడుదల చేసింది. జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలకు ఈ నిధులు కేటాయించారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన రూ.410 కోట్లతో పాటు ఈ నిధులు పంచాయతీరాజ్ సంస్థలకు లబ్ధి చేకూరుస్తాయి. నర్సరీలు, సీడ్ గార్డెన్ల ఏర్పాటుకు రూ.2.40 కోట్లు కూడా విడుదలయ్యాయి.