ఆంధ్రా పేపర్ మిల్లు నుంచి ఎక్కువ మోతాదులో కాలుష్యం విడుదల అవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భారీ స్థాయిలో పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూ కనీసం పన్ను కూడా కట్టడం లేదేంటి అంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు రూ. 21.34 కోట్ల వరకు పన్నులు చెల్లిచాల్సి ఉందని గుర్తు చేశారు. దాంతో ఆంధ్రా పేపర్ మిల్లుపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సమన్స్ జారీ చేసి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.