పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో రామాలయ నిర్మాణం విషయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ గుడ్ న్యూస్ చెప్పారు. శిథిలావస్థకు చేరిన పాత ఆలయాన్ని తొలగించి.. నేలను చదును చేసే పనులు ఆదివారం బ్రహ్మమూర్తం సమయంలో ప్రారంభించామని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. నేలను చదును చేసిన తర్వాత.. మే 3న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం ఇప్పటికే కోటి రూపాయలకుపైగా విరాళాలు వచ్చాయి.