హైడ్రా మరోసారి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు కూల్చి వేసింది. అంతే కాకుండా.. ఎన్నో ఏళ్ల నుంచి కబ్జాలో ఉన్న భూములను కూడా రక్షించింది. ఇలా మొత్తం రూ.400 కోట్ల విలువైన ఆస్తులను హైడ్రా కాపాడింది. అంతే కాకుండా.. ఈ సారి బతుకమ్మ వేడుకలను బతుకమ్మ కుంట వద్ద నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకోగా.. ఆ పరిసర ప్రాంతాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. పాత్ వే, చెట్ల పెంపకం లాంటివి చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.