ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా రైతుల కష్టాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు సీఎం చంద్రబాబు. రొయ్యల మేతకు ఉపయోగించే ముడిపదార్థాల ధరలు పెరిగి ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ ధరలను స్థిరీకరించాలని కోరిన చంద్రబాబు.. వంద కోట్ల కార్పస్ ఫండ్తో ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.