హైదరాబాద్పై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ అభివృద్ధిని చూస్తే తనకు అసూయగా అనిపిస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులను కట్టుబట్టలతో బయటకు పంపించారని పేర్కొన్నారు. అదే అవమానమే అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాలనే పట్టుదలకు కారణమైందన్నారు.