డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన సతీమణి అన్నా లెజినోవా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. భుజానికి సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు అన్నా లెజినోవా. ఈ క్రమంలోనే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.