ఆఖర్లో ట్విస్ట్.. అమరావతి ఆహ్వాన పత్రిక మారింది.. కొత్తగా ఆయన పేరు..

10 months ago 18
అమరావతి పునఃప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గరపడుతోంది. శుక్రవారం ( మే 2) అమరావతి పునఃప్రారంభోత్సవం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం అతిథులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే అమరావతి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆహ్వాన పత్రికలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పేర్లు మాత్రమే ఉండటంతో జనసైనికులు మండిపడ్డారు. తమ అధినేతకు గౌరవం ఇవ్వాలంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును అమరావతి ఆహ్వాన పత్రికలో చేర్చుతూ మార్పులు చేశారు.
Read Entire Article