ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొత్త హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైస్ ఛాన్స్లర్ ప్రొ. కుమార్ మొలుగరం ఆహ్వానించారు. రూ. 80 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ హాస్టళ్లు 1,200 మంది విద్యార్థులకు వసతిని కల్పిస్తాయి. సుదీర్ఘ కాలం తర్వాత ఓయూకు వస్తున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం విశేషం. దీంతో పాటు ఆ రోజు 'సీఎం రీసెర్చ్ ఫెలోషిప్' పథకం కూడా ప్రారంభమవుతుంది. గిరిజన విద్యార్థుల కోసం మరో రెండు హాస్టళ్లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.