తెలంగాణలో ఆగస్టు 22న ఓయూ జేఏసీ బందుకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తాజాగా మోండా మార్కెట్లో మార్వాడీలు దళితుడిపై దాడి చేయడాన్నిఖండిస్తూ.. ఓయూ జేఏసీ బందుకు పిలుపునిచ్చారు. ప్రజలందరూ దీనికి మద్దతిచ్చి.. బందును విజయవంతం చేయాలని కోరుతున్నారు. మార్వాడీలు తెలంగాణలో ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని, స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని ఓయూ జేఏసీ ఆరోపిస్తోంది. అయితే మార్వాడీ ఉద్యమానికి కొందరు మద్దతిస్తుండగా.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆవివరాలు..