ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త వినిపించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ ఏడో తేదీ నుంచి చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే చేనేత వస్త్రాలపై జీఎస్టీని భరించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే చేనేతల కోసం ఉద్దేశించిన థ్రిఫ్ట్ ఫండ్కు 5 కోట్లు కేటాయించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.