వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మామూనురు ప్రధాన రహదారిపై ఇనుప స్తంభాలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. రహదారిపై లారీ పక్క నుంచి వెళ్తున్న రెండు ఆటోలు, కారుపై లారీ పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిసింది.