మహిళా స్వయం సహాయక సంఘాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటితో కలిసి మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని మహిళలందరినీ కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని, అందులో భాగంగానే వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని ఆమె తెలిపారు. మహిళా సంఘాల ద్వారా వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని, మహిళలు తయారు చేసిన వస్తువుల అమ్మకం కోసం హైదరాబాద్లో దుకాణాలు ప్రారంభించామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.