ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు 1500 ఎకరాల భూమి అవసరమని రక్షణ, విమానయాన అధికారుల బృందం తేల్చింది. గతంలో అనుకున్న 800 ఎకరాలకు అదనంగా మరో 800 ఎకరాలను సేకరించాల్సి ఉండటంతో అధికారులు సీసీఐ, నిషాన్ఘాట్ ప్రాంతాలను పరిశీలించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో జరిగిన ఈ పర్యటనలో టెక్నికల్ అంశాలపై చర్చించారు. జూన్ 2వ తేదీ కల్లా భూమిపూజ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే భూసేకరణపై పూర్తి స్పష్టత వచ్చే ఛాన్సుంది.