ఛాంఫియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, పాక్ మధ్య ఆదివారం హైఓల్టేజ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ను కోట్ల మంది భారతీయులు టీవీలు, సెల్ఫోన్లలో వీక్షించి ఎంజాయ్ చేశారు. అయితే దాయాదుల మధ్య పోరుకు ఉండే క్రేజ్ను గుర్తించిన ఓ పెళ్లి కొడుకు మండపంలోనే ప్రత్యేకంగా స్క్రీన్ ఏర్పాటు చేసి పెళ్లికి హాజరైన వారిని సర్ఫ్రైజ్ చేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.