తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్పూర్ గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్తో పాటు 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.