ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు చూసేవారికి గుంటూరు జిల్లా టీచర్ శౌరి మాస్టర్ ఓ కొత్త దారి చూపించారు. ఆదివారం కూడా స్కూల్ తెరిచి, పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులో ఉందని నిరూపిస్తున్నారు. పిల్లల్లో ఆంగ్లంపై భయాన్ని పోగొట్టి, వారిని ధైర్యంగా మాట్లాడేలా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది స్కూల్లో పిల్లల సంఖ్య రెట్టింపు చేయడమే ఆయన లక్ష్యం.