తెలంగాణలో ఆసరా పింఛన్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు కొత్త నిబంధనలతో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఓటరు గుర్తింపు కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం అదనంగా అడుగుతుండటంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో రేషన్కార్డు, ఆధార్ వంటివి సరిపోగా.. స్థానికత, ఆదాయం నిర్ధారణకు ఈ కొత్త పత్రాలు అవసరమని అధికారులు చెబుతున్నారు. దీంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.