హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 సక్సెస్ అయింది. దేశవ్యాప్తంగా ఉన్న భారీ సైబర్ క్రైం నెట్వర్క్ను ఛేదించారు. 9 రాష్ట్రాల్లో సోదాలు చేపట్టి పలువురిని అరెస్ట్ చేశారు. ఏకంగా రూ.150 కోట్ల సైబర్ మోసాలు జరిగాయని గుర్తించారు. ఇక సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అధికారులు సహకరిస్తున్నారని గుర్తించి.. వారిని కూడా అదుపులోకి తీసుకోవడం గమనార్హం.