ఆమనగల్లు ఉత్సవాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారీగా భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో భక్తులు పడిపోయారు. దీంతో 10 మంది భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రాణాలకు తెగించి.. అగ్నిగుండంలో పడిపోయిన భక్తులను కాపాడారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.