తెలంగాణ ముఖ్యమంత్రి పదవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న మూడేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత తాను సీఎం పదవికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. అంతేకాకుండా, తొమ్మిదేళ్ల తర్వాత సీఎం కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై విమర్శలు చేస్తూ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా ఆయన స్పందించారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్తోనే పాలన చేసిందని ఆరోపించారు.