గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా 27 మున్సిపాలిటీలను విలీనం చేసి 300 డివిజన్లుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే జీహెచ్ఎంసీని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించనున్నారు. హైదరాబాద్ పేరుతోనే జీహెచ్ఎంసీ కొనసాగనుండగా.. సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లుగా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జోన్లపై క్లారిటీ రానుంది.