మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల పార్టీ కీలక నేతలు లొంగిపోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించింది. గతంలో లాగానే తాము శాంతియుతంగా ఉంటామని వెల్లడించింది. శాంతి కావాలని తెలంగాణ సమాజాం కోరుకుంటోందని చెప్పింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది.