మరో ఆరు నెలల్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులను ఆదేశించారు. మంత్రుల పనితీరుపై ఏప్రిల్ 2న కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు ఇస్తామని.. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియాను విరివిగా వాడాలని సూచించారు. కాగా, 2021లో ఎన్నికైన ప్రస్తుత పాలకవర్గాల గడువు 2026 మార్చి-ఏప్రిల్ నాటికి ముగియనుంది.