ఆర్అండ్బీ ఈఎన్సీ అవినీతి చిట్టా బయటికి వచ్చింది. హైదరాబాద్లో ఏసీబీ అధికారులు 11 ప్రాంతాల్లో 16 బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. భారీగా అవినీతి బాగోతం బయటికి వచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులకు రూ.60 లక్షల నగదు దొరికింది. అంతేకాకుండా 3 కిలోల బంగారం, మద్యం సీసాలు లభించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మోహన్ నాయక్ మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.