ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలనుకునే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ అద్భుతమైన ప్యాకేజీ తీసుకువచ్చింది. 9 రోజుల పాటు 13 దేవాలయాలను సందర్శించేలా ప్రత్యేక బస్సు సర్వీస్ ఏర్పాటుచేసింది. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో అధికారులు ఈ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. మార్చి 19వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ బస్సు బయల్దేరనుంది. ఈ యాత్రలో ఏయే ఆలయాలను దర్శించుకోవచ్చు, టిఫిన్, భోజనం సౌకర్యం సంగతేంటీ, టికెట్ ధర ఎంత అలాంటి వివరాలను ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.