నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. సమ్మెలో భాగంగా.. శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణం చేసుకోగా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఆయన కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మృతుడి కుటుంబానికి అదనంగా రూ.5 లక్షల వ్యక్తిగత సాయం ప్రకటించారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.