ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్కు సంబంధించి బిగ్ అలర్ట్ వచ్చింది. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అర్ధరాత్రి నుంచి సమ్మె చేపడతామని కార్మిక సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన సర్కార్.. చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కొత్త కమిటీ.. అన్ని యూనియన్ల నేతలతో సమావేశమై వారి సమస్యలను విననుంది. కమిటీతో కార్మిక సంఘాల చర్చలు సఫలమైతే బంద్ ఆగిపోనుంది.