టీజీఎస్ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆత్మహత్యాయత్నం చేసిన నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. పెట్రోల్ పోసుకొని 80 శాతం గాయాలతో ఆసుపత్రిలో పోరాడిన ఆయన చివరకు తుది శ్వాస విడిచారు. శంకర్ గౌడ్ మృతి కార్మిక వర్గాల్లో ఆగ్రహాన్ని నింపింది. కాగా, ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేస్తూ.. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. సమస్యల పరిష్కారం కోసం నేడు మంత్రుల బృందం కార్మిక నేతలతో చర్చలు జరపనుంది.