ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వర్సిటీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. త్వరలోనే ప్రొఫెసర్ కోదండరామ్ను చట్టసభలకు పంపుతామని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ఆర్ట్స్ కాలేజీ ముందు బహిరంగ సభ పెడతానని వెల్లడించారు.