ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ నిలిచిన నేపథ్యంలో ఆ జట్టు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ట్రోఫీ గెలిచి రెండు రోజులు గడుస్తున్నా సంబరాలు ఆగటం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆర్సీబీ అభిమానులు ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు ఉచితంగా ఆకలి తీర్చారు. ఈ వీడియోను ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఎక్స్ వేదికగా పంచుకున్నారు.