రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ చేయించాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. వారం వ్యవధిలో ఏపీలో ముగ్గురు అమ్మాయిలు బలైపోయారని.. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాయని మండిపడ్డారు. ప్రియాంక కేసులో టీడీపీ, వైసీపీలు లాలూచీ అయ్యాయని.. దీనిపై మాట్లాడేవారే లేకుండా పోయారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు.